తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసనసభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గత ప్రభుత్వ అధినేత నేరుగా తప్పు చేశారని తాను అనలేదని, అయితే ఆయన నియమించిన టీటీడీ బోర్డు సభ్యులదే ఈ పాపంలో పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు.
సుమారు 20 కోట్ల లడ్డూలను పాల చుక్క లేని రసాయనాల మిశ్రమంతో తయారు చేసి 11 కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు.










