తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ: దర్శనానికి 12 గంటల సమయం

0
0

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. బుధవారం ఉదయానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 25 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.

టోకెన్లు లేని (సర్వదర్శనం) భక్తులకు స్వామివారి దర్శనం లభించడానికి సుమారు 12 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల సంఖ్య పెరగడంతో క్యూలైన్లు వెలుపల వరకు విస్తరించాయి.