టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా నేడు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్, జింబాబ్వే జట్లు తలపడనున్నాయి. సెమీస్ రేసులో నిలవాలంటే టీమిండియాకు ఈ విజయం అత్యంత కీలకం.
అభిమానులను ఊరిస్తున్న వాతావరణం విషయానికి వస్తే.. నేటి మ్యాచ్కు వర్షం ముప్పు లేదని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ, మ్యాచ్ సాఫీగా సాగే అవకాశం ఉంది. రాత్రి 7:00 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోరులో భారత్ భారీ విజయంపై కన్నేసింది.
