రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా ఏపీ శాసనమండలి రణరంగాన్ని తలపించింది. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడేందుకు ప్రయత్నించగా, వైసీపీ సభ్యులు ఆయనపైకి దూసుకెళ్లి దాడికి యత్నించారు.
మంత్రులు అనిత, గొట్టిపాటి రవికుమార్ అడ్డుకోవడంతో ఇరుపక్షాల మధ్య తోపులాట జరిగింది. ఈ గందరగోళం మధ్య సభ నియంత్రణ తప్పడంతో ఛైర్మన్ మోషేనురాజు మండలిని రేపటికి వాయిదా వేశారు.










