మదనపల్లి సమీపంలోని రామసముద్రం టీటీడీ కళ్యాణ మండపంలో ‘జై కిసాన్ జంక్షన్’ ఆధ్వర్యంలో లక్కీ డిప్ విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.
జువారి ఫామ్ హబ్ జోనల్ మేనేజర్ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, వూలపాడుకు చెందిన కేశవరెడ్డికి మొదటి బహుమతిగా రూ. 1.50 లక్షల విలువైన బంగారు నాణేన్ని అందజేశారు.
దసరా, దీపావళి సందర్భంగా నిర్వహించిన ఈ స్కీమ్లో మొత్తం 36 మంది రైతులు ఎంపికయ్యారు. ఇతర విజేతలకు మొబైల్ ఫోన్లు, మిక్సీలు, గడియారాలను బహూకరించారు.










