కూటమి ప్రభుత్వంలో ప్రాణాంతకంగా మారిన పాలు

0
0

రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు.

శనివారం తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలు, కలుషిత నీటి కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచుగా వెలుగు చూస్తున్నాయి అని పేర్కొన్నారు.

#Boiena Rajesh