అన్నమయ్య జిల్లా పుంగనూరులో టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ కళ్యాణ వేంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారు యోగనరసింహస్వామి అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు.
సాంస్కృతిక ప్రదర్శనల మధ్య పట్టణ వీధుల్లో జరిగిన స్వామివారి ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గోవింద నామస్మరణతో పులకించిపోయారు.
# కొత్తూరు మురళి.
