మదనపల్లె టూటౌన్ ఎస్సైగా నాగేశ్వరరావు బాధ్యతల స్వీకరణ.

0
0

మదనపల్లె రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సైగా నాగేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు జరిగిన బదిలీల్లో భాగంగా, చౌడేపల్లి నుండి ఆయన ఇక్కడకు వచ్చారు.

గతంలోనూ ఇక్కడ పనిచేసిన అనుభవం ఆయనకు ఉండటం విశేషం. ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వహించిన రహీముల్లా వన్ టౌన్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు.

బాధ్యతలు చేపట్టిన నాగేశ్వరరావుకు పోలీస్ సిబ్బంది మరియు స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు.