నిజామాబాద్ నగరంలోని ఎస్ఎఫ్ఎస్ (సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్స్) పాఠశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైన్స్ ఫెయిర్ ఘనంగా నిర్వహించారు.
ఈ ప్రదర్శనలో పాఠశాల విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ మరియు పర్యావరణ పరిరక్షణపై రూపొందించిన వివిధ రకాల నమూనాలను ప్రదర్శించారు.
విద్యార్థుల సృజనాత్మకతను మరియు విజ్ఞానాన్ని వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఇతర పాఠశాలల విద్యార్థులు కూడా ఈ ప్రదర్శనను సందర్శించి ఆసక్తికర విషయాలను అడిగి తెలుసుకున్నారు.
