ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదరడంతో భద్రతా కారణాల రీత్యా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) సహా ప్రధాన ఎయిర్పోర్టులను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఈ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు కావడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రయాణికులు ఎయిర్పోర్టుకు రావొద్దని, ప్రయాణానికి ముందు తమ విమాన స్థితిని (Flight Status) సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమమని హెచ్చరించారు.






