హోలీ సంబరాల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
0

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  :  బోయిన్ పల్లి లోని మల్లారెడ్డి గార్డెన్స్ లో మహావీర్ ఇంటర్నేషనల్ ఉడాన్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన హోలీ సంబురాలలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సంబురాలలో పాల్గొన్న అందరికీ ఎమ్మెల్యే శ్రీగణేష్ శుభాకాంక్షలు తెలిపారు.

చెడు పై మంచి గెలుపునకు సూచికగా ‘కామ దహనం’తో ప్రారంభమయ్యే హోలీ పండుగ మనందరి జీవితాల్లో కొత్త రంగులు అద్దుతుందని అన్నారు.
హోలీ పండుగ సందర్భంగా బంధుమిత్రులతో, సాటివారితో ఆనందం పంచుకుని అందరూ సుఖసంతోషాలతో ఉండడం ఆనందంగా ఉందని, మహావీర్ ఇంటర్నేషనల్ ఉడాన్ సంస్థ ఇలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు.

అలాగే తుకారాం గేట్ లోని ఎమ్మెల్యే నివాసం వద్ద జరిగిన హోలీ వేడుకలలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పాల్గొని అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

#sidhumaroju
Alwal