హెచ్‌సీఏలో ‘విశాఖ’ సెగ: రూ. 70 కోట్ల చెల్లింపులపై జింఖానాలో రచ్చ!

0
0

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో రూ. 70 కోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. మంత్రి వివేక్ వెంకటస్వామికి చెందిన విశాఖ ఇండస్ట్రీస్‌కు నిబంధనలకు విరుద్ధంగా నిధులు కట్టబెట్టారని ఆరోపిస్తూ క్రికెట్ సంఘాల ప్రతినిధులు జింఖానా గ్రౌండ్‌లో భారీ ధర్నాకు దిగారు.

ఈ క్రమంలో ప్రెసిడెంట్ ప్రెస్ మీట్‌ను నిరసనకారులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అయితే, ఈ ఆరోపణలను హెచ్‌సీఏ అధ్యక్షుడు తోసిపుచ్చారు. తాను బాధ్యతలు చేపట్టకముందే, కోర్టు ఆదేశాల మేరకే ఆ కంపెనీకి చెల్లింపులు జరిగాయని, తనపై కావాలనే బురదజల్లుతున్నారని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదం ప్రస్తుతం తెలంగాణ క్రీడా మరియు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

#sidhumaroju
Alwal