కడప పట్టణ జనసేన నాయకులు రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు మరియు కూటమి బలోపేతంపై వారు చర్చించారు.
టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందించుకోవాలని, ప్రజల సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ భేటీ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.










