ఈనెల 10, 11 తేదీల్లో పుంగనూరులో జరగనున్న శ్రీసుగుటూరు గంగమ్మ జాతరను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారుల సమన్వయం అత్యవసరమని మున్సిపల్ ఛైర్మన్ ఆలీ బాషా తెలిపారు.
మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో, జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ జాతర కోసం మున్సిపాలిటీ తరఫున రూ. 10 లక్షలు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు
# కొత్తూరు మురళి .










