నిమ్మనపల్లి మండలం పెద్దకొండపై మంటలను ఆర్పేందుకు వెళ్లిన ఎఫ్.బి.ఓ హరిశంకరరెడ్డి వడదెబ్బకు గురై అడవిలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆయనను గుర్తించి సురక్షితంగా రక్షించారు.
ప్రస్తుతం ఆయన మదనపల్లి ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. అటవీ సంపద రక్షణ కోసం ఆయన చూపిన ధైర్యాన్ని పలువురు ప్రశంసించారు. అడవిలో మంటలు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.









