తిరుపతి నుంచి మదనపల్లెలో బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన బీటెక్ విద్యార్థి ధనుష్(22) శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.
స్నేహితుని బైక్పై బెంగళూరు రోడ్డులోని ఆలయానికి వెళ్తుండగా, మడికాయల శివాలయం ఆర్చి వద్ద కారు వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో ధనుష్కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.










