రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల కొరత తీవ్రమైంది. వేళకు బస్సులు రాక, వచ్చినా స్టాపుల్లో ఆగక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంత ప్రజలు, విద్యార్థులు గంటల తరబడి బస్ స్టాప్లలో పడిగాపులు కాస్తున్నారు.
అరకొర బస్సుల్లో ప్రమాదకరంగా ఫుట్బోర్డ్ ప్రయాణాలు సాగుతున్నాయి. కొత్త బస్సులను వెంటనే ప్రవేశపెట్టి, రద్దీకి అనుగుణంగా ట్రిప్పులు పెంచాలని ప్రయాణికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.










