ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
అయితే భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది.
*లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టు తడబడింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్లో జాకబ్ బెథెల్ అద్భుతమైన ఇన్నింగ్స్తో పోరాడినప్పటికీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 246 పరుగులే చేయగలిగింది.
తద్వారా భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి ప్రవేశించింది.










