టీ20 వరల్డ్ కప్: ఫైనల్లోకి భారత్ 🏏🇮🇳
టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో భారత్ అద్భుత విజయం సాధించింది. ఇంగ్లండ్పై 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్కు దూసుకెళ్లింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కూడా బలంగా పోరాడినా 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులకే పరిమితమైంది.
దీంతో 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది.
స్కోర్లు:
భారత్ – 253/7 (20 ఓవర్లు)
ఇంగ్లండ్ – 246/7 (20 ఓవర్లు)
కీలక సమయంలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ లక్ష్యాన్ని చేధించలేకపోయింది.





