యర్రబాలెం నల్లచెరువు అభివృద్ధి కమిటీ అక్రమాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేపల వేలం, దుకాణాల అద్దెల ద్వారా వస్తున్న లక్షలాది రూపాయల ఆదాయాన్ని సొంతానికి వాడుకుంటున్నారని, చెరువు అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
మంత్రి లోకేష్ చొరవతో రైలింగ్ ఏర్పాటు చేసినా, పూర్తిస్థాయిలో చెరువును ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని వాకింగ్ ట్రాక్, గ్రంథాలయం నిర్మించాలని ప్రజలు విన్నవిస్తున్నారు. దశాబ్దాల అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
