దోర్నాల హైస్కూల్లో అధికారుల మెరుపు తనిఖీ.. ఉపాధ్యాయులకు వార్నింగ్!

0
0

దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ – నిర్లక్ష్యంపై అధికారులకు హెచ్చరిక
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం
దోర్నాల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన యర్రగొండపాలెం నియోజకవర్గం టిడిపి ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు మరియు RWS SE విద్యార్థులకు త్రాగునీరు అందించే RO ప్లాంట్ పూర్తిగా అశుభ్రంగా, నిర్వహణ లేకుండా ఉండటాన్ని* గమనించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థుల ఆరోగ్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత స్కూల్ యాజమాన్యం మరియు అధికారులను వెంటనే పిలిపించి, *ఇలాంటి పరిస్థితులు మళ్లీ కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని గట్టి హెచ్చరిక చేశారు.
పాఠశాలలో త్రాగునీటి శుభ్రత, విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, వెంటనే RO ప్లాంట్‌ను శుభ్రపరిచి సక్రమంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.

స్కూల్ ఆవరణంలో వాహనాల పార్కింగ్ ను తొలగించాలని విద్యార్థులు కోరగా తక్షణమే తగిన చర్యలను తీసుకోవాలని SI వెంకటరమణయ్య కు ఎరిక్షన్ బాబు సూచనలు చేశారు
విద్యార్థుల సంక్షేమమే తమకు ముఖ్యమని, విద్యార్థుల సౌకర్యాల విషయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి అన్ని పరిశుభ్రంగా