పుంగనూరు నియోజకవర్గం, సదుం విద్య వనరుల కేంద్రం వద్ద వెంకటమ్మ అలియాస్ చిన్న పాపమ్మ (90) దయనీయ స్థితిలో జీవిస్తున్నారు. ఓటర్ ఐడి ఉన్నప్పటికీ, రేషన్, ఆధార్ కార్డులు లేకపోవడంతో ఆమెకు పింఛన్ అందడం లేదు.
ఎవరైనా పెట్టే తిండి తింటూ ఇబ్బందులు పడుతున్న ఆమె, పింఛన్ మంజూరు చేస్తే ఎంతో సహాయకరంగా ఉంటుందని శుక్రవారం వేడుకున్నారు. అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు
# కొత్తూరు మురళి .










