వెంకటగిరి జెడ్పీ బాలికల హైస్కూల్ విద్యార్థినుల నిజాయతీని హోంమంత్రి అనిత అభినందించారు. దొరికిన బంగారం, నగదు ఉన్న పర్సును పోలీసులకు అప్పగించి ఆదర్శంగా నిలిచిన ఐదుగురు విద్యార్థినులను ఆమె కొనియాడారు.
చిన్న వయసులోనే గొప్ప విలువలు చాటారని, వారిని పెంచిన తల్లిదండ్రులు, గురువులకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి లోకేశ్ కూడా “మా అమ్మాయిలు బంగారం” అంటూ వారిని ప్రశంసించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.










