చీరాల లో ఏసీబీ దాడులు

0
0

బాపట్ల జిల్లా చీరాలలో ఏసీబీ దాడులు నిర్వహించారు. గిద్దలూరు ఇన్చార్జి సబ్ రిజిస్టర్ గా పనిచేసిన కృష్ణ మోహన్ రావుకు చెందిన ఇంట్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు.

పలు రికార్డులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదుతో కృష్ణ మోహన్ రావుపై గతంలో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో చీరాలలోని ఆయన చెందిన ఇంటిని అధికారులు జల్లెడపట్టేరు.

అయితే అధికారి కృష్ణ మోహన్ రావు ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు.