మదనపల్లి: రైస్ మిల్లు యజమానులపై కేసులు నమోదు.

0
0

మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని తిరుమల మోడ్రన్, వంశీ కృష్ణా రైస్ మిల్లులపై కడప విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి, 800 బస్తాల పీడీఎఫ్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ సిఐ శివన్న ఫిర్యాదు మేరకు.

మిల్లు యజమానులైన ధీరజ్, కిషోర్, నమో నారాయణలపై ఈసీ యాక్ట్ (EC Act) కింద టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ బియ్యం నిల్వలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు శనివారం హెచ్చరించారు.