మదనపల్లెలో సంచలనం సృష్టించిన పూల దివాకర్ హత్య కేసులో ముగ్గురు నిందితులను శనివారం అరెస్ట్ చేశారు. నిందితులు పూల గణేష్, సుబ్రహ్మణ్యం, మునికంఠేశ్వర ప్రసాద్లను విచారించగా, నేరం అంగీకరించడంతో వారిని రిమాండ్కు తరలించారు.
పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని తాలూకా సీఐ కళా వెంకటరమణ హెచ్చరించారు.










