రాజముద్రతో సరికొత్త హక్కు.. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం.

0
0

రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
దొనకొండ మండలం, ఆరవల్లిపాడు గ్రామంలో ఆదివారం రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు మండల తహసీల్దార్ రమాదేవి గారితో కలిసి దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో దొనకొండ తహసీల్దార్, దొనకొండ మండల పార్టీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు, మండల మాజీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు, ఆడవాళ్లపాడు గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు మరియు మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు