మదనపల్లిలోని సన్ షైన్ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరిన 33 ఏళ్ల గాయత్రి ఆపరేషన్ వికటించి మృతి చెందింది. వాల్మీకిపురానికి చెందిన గాయత్రి రెండో కాన్పు కోసం ఆసుపత్రిలో చేరగా, సర్జరీ సమయంలో ఊపిరాడక మరణించింది.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆదివారం ఉదయం ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. టూ టౌన్ ఎస్ఐ నాగేశ్వర్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.










