ఏపీ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి, అన్నమయ్య జిల్లాలోని అంగన్వాడీలు, చౌక ధరల దుకాణాలు, వసతి గృహాలను ఆదివారం తనిఖీ చేశారు. మదనపల్లెలో వసతి గృహాలను పరిశీలించి, అక్కడి సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, అధికారుల నిర్లక్ష్యం తగదని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు పౌష్టికాహారం అందాలని స్పష్టం చేశారు










