మదనపల్లి మండల సర్వేయర్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బాధితులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. బసినికొండ సర్వే నంబర్ 1058/4లోని తమ ప్లాట్లను
నిబంధనలకు విరుద్ధంగా సబ్ డివిజన్ చేసి ఇతరులకు కట్టబెట్టారని శ్రీనివాసులు రెడ్డి, సహదేవ ఆరోపించారు. అన్యాయం చేసిన సర్వేయర్పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.










