18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ ఆధారిత ప్రాజెక్టు ప్రారంభం: సత్యకుమార్ యాదవ్
Satya Kumar Yadav Launches AI Project in 18 AP Govt Hospitals
వైద్య సేవలను మరింత వేగవంతం చేసేందుకు ఏఐ టెక్నాలజీ
40 అత్యాధునిక పరికరాల ద్వారా వ్యాధి నిర్ధారణ
సమయం ఆదా కావడమే కాకుండా, కచ్చితత్వంతో కూడిన చికిత్స అందుతుందన్న సత్యకుమార్.
ఆంధ్రప్రదేశ్లో వైద్య సేవలను మరింత వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ ఆధారిత పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. సుమారు 40 అత్యాధునిక పరికరాల ద్వారా స్క్రీనింగ్, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. దీనివల్ల సమయం ఆదా కావడమే కాకుండా, కచ్చితత్వంతో కూడిన చికిత్స అందుతుందని ఆయన పేర్కొన్నారు.










