సారా విక్రయం కేసులో నిందితుడైన సామర్లకోట పట్టణంలోని కుమ్మర వీధికి చెందిన గుబ్బల వీర ఆదివిష్ణువును సోమవారం కాకినాడ సబ్ జైలుకు తరలించారు.
ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారుల వివరాల ప్రకారం, నిందితుడిని సామర్లకోట తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి ఎదుట బైండోవర్ నిందితుడిగా హాజరు పరచారు. విచారణ అనంతరం తహసీల్దార్ మూడు రోజుల రిమాండ్ వారెంట్ జారీ చేసినట్లు తెలిపారు.
ఈ మేరకు నిందితుడిని కాకినాడ సబ్ జైలుకు తరలించినట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సీఐ కె. రామ్మోహనరావు వెల్లడించారు. అక్రమంగా సారా విక్రయాలపై కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.










