తాడేపల్లిలో ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు.

0
0

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంఘ సంస్కర్త, భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మహిళా విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని అన్నారు. సమాజంలో మహిళలకు విద్య అందించేందుకు ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
సమాజంలో మహిళల విద్యా విస్తరణ కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి ఎంతో గొప్పదని, అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ మహిళా సాధికారతకు ఆమె మార్గం సుగమం చేశారని తెలిపారు. మహిళలు విద్య ద్వారా అభివృద్ధి సాధించాలనే ఆమె ఆశయాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పలువురు పాల్గొన్నారు.