మదనపల్లె మండలంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో సిద్ధమ్మ(70) అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఆమెకు చీటీగలు కుట్టకుండా ఒత్తి వెలిగించగా, బెడ్షీట్ అంటుకోవడంతో మంటలు చెలరేగి ఆమెకు అంటుకున్నాయి.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సిద్ధమ్మను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.










