పరిశూభ్రత అనేది ఒక సంస్కృతి అని, స్వచ్ఛాంధ్ర లక్ష సాధనలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. పట్టణాల్లో పారిశుధ్య లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
సచివాలయ సిబ్బంది బదిలీల అధికారాన్ని కలెక్టర్లకే అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కౌలు రైతులకు రుణాలందడంలో జాప్యం జరగకూడదని, వ్యవసాయ రంగంలో సాంకేతికతను జోడించాలని సూచించారు. డీప్ టెక్ వినియోగం ద్వారా పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.










