వేట్లపాలెం బాణాసంచా కేంద్రం పేలుడు ఘటనలో సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొన్న పెద్దాపురం ఎస్ఐ మౌనిక, సామర్లకోట ఎంపీడీవో హిమా మహేశ్వరిలను ఘనంగా సన్మానించారు.
రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు ఆదేశాల మేరకు కాకినాడలోని కార్యాలయంలో సోమవారం మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు (బున్ని) పుష్పగుచ్చాలు అందించి శాలువాతో వారిని సత్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ధైర్యంగా విధులు నిర్వహిస్తూ బాధితులకు సహాయం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో అధికారులు చూపిన అంకితభావం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.










