Quthbullapur Fire Accident: మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వేళ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిజాంపేట సర్కిల్ ప్రగతి నగర్ కమాన్ సమీపంలోని మియాపూర్ రోడ్డులో ఉన్న ఫర్నీచర్ మార్కెట్లో మంటలు చెలరేగడంతో బీభత్సం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 35వరకు దుకాణాలు కాలి బూడిదయ్యాయి.
కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు










