మదనపల్లి- పుంగనూరు రోడ్డులోని బసినికొండ వద్ద ఉన్న బాబ్జాన్ బాడీ బిల్డింగ్ షెడ్డులో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 1.5 లక్షల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక అధికారి శివప్ప, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల మంటలు పక్కనున్న ఇతర షెడ్లకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు.










