అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను చట్టపరిధిలో తక్షణమే పరిష్కరించి న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని, కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలు, నకిలీ పత్రాలు, ఆన్లైన్ మోసాలపై బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, బాధితులకు తక్షణ న్యాయం అందించాలని సూచించారు.










