బాపట్ల: ఈ రోజు బాపట్ల జిల్లా బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణాలు, తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడవలసిన ప్రభుత్వం ఈరోజు తిరుమల తిరుపతి పవిత్రతను గాలికి వదిలి చైర్మన్ బిఆర్ నాయుడు లాంటి వారు చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణాలను ప్రశ్నిస్తూ, బిఆర్ నాయుడు చైర్మన్ పదవి నుండి తొలగించి.
శిక్ష పడేలా చేయాలని ఈ రోజు బాపట్ల టౌన్ ఫ్లైఓవర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేసీన బాపట్ల జిల్లా అధ్యక్షులు మెరుగు నాగార్జున ,బాపట్ల నియోజకవర్గం ఇంచార్జి కోన రఘుపతి , రేపల్లె నియోజకవర్గ ఇంచార్జి పీటా నాగ మోహన్ కృష్ణ, అద్దంకి నియోజవర్గం ఇంచార్జి చింతలపూడి అశోక్ కుమార్ , వేమూరు నియోజకవర్గ ఇంచార్జ్ వరకుటి అశోక్ బాబు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు నిరసనలో పాల్గొని విజయవంతం చేశారు.
#Narendra










