మదనపల్లెలో ప్రైవేట్ ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని ఒక దొంగ వరుస చోరీలకు పాల్పడుతున్నాడు. అర్థరాత్రి సమయంలో ఆసుపత్రుల్లోకి చొరబడి క్యాష్ పెట్టెలలోని నగదును దోచుకుంటున్నాడు. ఈ ఘటనలతో వైద్యులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం పోలీసులకు సమాచారం అందడంతో, సీసీ కెమెరా ఫుటేజీని సేకరించి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.










