మదనపల్లె ఆసుపత్రిలో మందుల కొరత.. ఎమ్మెల్యే షాజహాన్ ఆగ్రహం.

0
1

శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన పత్రికా సమావేశంలో, ఎమ్మెల్యే షాజహాన్ భాష మందుల కొరత, సెక్యూరిటీ లోపాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎముకల వైద్యుడిని తక్షణమే సరెండర్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటం ప్రతి డాక్టర్ బాధ్యత అని, ఏ సమస్య వచ్చినా వెంటనే RMO, సూపరింటెండెంట్‌కు తెలియజేయాలని ఆయన సూచించారు.