ఉమ్మడి చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వీర్ణమల గ్రామానికి చెందిన షూటింగ్ బాల్ క్రీడాకారుడు నవీన్, ఇండియా-నేపాల్ ద్వైపాక్షిక సిరీస్కు ఎంపికయ్యారు. ఏప్రిల్ 7, 8 తేదీల్లో నేపాల్లోని ఖాట్మండులో జరిగే ఈ సిరీస్లో నవీన్ భారత జట్టు తరపున ఆడనున్నారు. రాయలసీమ షూటింగ్ బాల్ జిల్లాల కన్వీనర్ నరేష్ బాబు, అన్నమయ్య షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి గౌతమి, తిరుపతి జిల్లా కార్యదర్శి నాగరాజులు నవీన్ను అభినందించి, సిరీస్లో రాణించాలని ఆకాంక్షించారు.










