అన్నమయ్య జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, 31 గ్యాస్ ఏజెన్సీలపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ శనివారం తెలిపారు. గ్యాస్ సరఫరాపై సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మవద్దని, జిల్లా, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ఫిర్యాదులకు స్పందిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువులోనే బుకింగ్ చేయాలని, అవసరానికి మించి సిలిండర్లు నిల్వ చేయవద్దని, గృహ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.










