మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు ఆందోళన

0
7

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా సమస్యలు పరిష్కారం కావడం లేదని, గత 20 ఏళ్లుగా పేద, కార్మిక, కష్టజీవులకు రూ.18,000 ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలని పోరాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని ఆశా వర్కర్లు ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఆశలకు ఫిక్స్‌డ్ వేతనాలు, ఇన్సూరెన్స్, ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వాలని చర్చించాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆశా వర్కర్లను, సీఐటీయూ నాయకులను అరెస్టు చేశారు.