ప్రైవేట్ ఆస్పత్రులే టార్గెట్ – మదనపల్లెలో దొంగ సంచలనం.

0
2

మదనపల్లెలో అర్ధరాత్రి వేళ ఆస్పత్రుల్లోకి చొరబడి క్యాష్ పెట్టెల్లోని డబ్బును దొంగిలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి సీటీఎం రోడ్డులోని ఓ ఆస్పత్రిలో దొంగతనం యత్నం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రైవేట్ వైద్యులు భయాందోళనల్లో ఉన్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు వివిధ ఆస్పత్రుల సీసీ కెమెరా ఫుటేజీలను సేకరిస్తున్నారు. దొంగను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు శనివారం తెలిపారు