అంగన్వాడీల సమస్య లు పరిష్కరించాలి.

0
1

అంగన్వాడీల సమస్య లు పరిష్కరించాలి.

సిఐటియు జిల్లా కార్యదర్శి సమ్మెట రాజమౌళి అంగన్వాడి జిల్లా కార్యదర్శి స్నేహ బిందు.
కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా.

కలెక్టర్ గారికి వినతి పత్రం.

ఈరోజు అంగన్వా డి టీచర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆఫీస్ ఆఫీస్ ముందు ఏడు వందల మందితో మూడు గంటల పాటు ధర్నా జరిగింది అనంతరం కలెక్టర్ గారికి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సమ్మెట రాజ మౌళి స్నేహబిందు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 70 వేల మంది అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ 50 సంవత్సరాల నుండి పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వీరంతా మహిళలు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు అత్యధికులు ఉన్నారు. నేటికీ వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడాలని ఎమ్మెల్యేలకు మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. చివరికి చలో హైదరాబాద్ వేలాదిమంది తరలి వెళ్లారు. పోలీసులు అరెస్టులు చేయడం నిర్బంధించడం అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్ర కమిటీ అంగన్వాడీ పిలుపులో భాగంగా కలెక్టర్ ఆఫీస్ ముందు 700 మందితో ధర్నా చేయడం జరిగింది. కనీస వేతనములు 26000 ఇవ్వాలని ఎడ్యుకేషన్ పాలసీని సవరించాలి ఫ్రీ పై మరి విద్యను అంగన్వాడీ కేంద్రాలలోనే నిర్వహించాలి టీచర్స్ హెల్పర్స్ ఇద్దరికీ ఒకేసారి మే నెల అంతా సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి కుంట్ల నాగన్న. వాసం దుర్గారావు. పగిడి పాల తిరుపతమ్మ. గుండు సులోచన. కుమ్మరి కుంట్ల జ్యోతి. సమ్మెట లలిత. ఏ ఉమా. కే సంధ్య. ఆర్ మల్లికాంబ. తదితరులు పాల్గొన్నారు.