పుంగనూరు: ఇరు వర్గాల ఘర్షణలో పలువురికి గాయాలు

0
0

అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలంలో ఆదివారం భూమి వాదం కర్రల దాడికి దారితీసింది. స్థానికుల వివరాల ప్రకారం, భూసాని కొరపల్లికి చెందిన వెంకటరమణ కుమారుడు మంజునాథ్ కు అదే గ్రామానికి చెందిన సిద్దిరాజు, వెంకటరమణ, శ్రీనివాసులతో భూమి విషయంలో వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు కర్రలతో పరస్పరం దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన వారిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.