అన్నమయ్య జిల్లాలో మహిళపై అత్యాచారం.. కేసు నమోదు.

0
0

అన్నమయ్య జిల్లాలో ఓ మహిళపై అత్యాచారం జరిగిన ఘటన సోమవారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిటీఎం మండలం పట్టంవారిపల్లి పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళను గత నెల 19వ తేదీన నిందితుడు కిడ్నాప్ చేసి కర్ణాటకకు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై కిడ్నాప్, అత్యాచారం కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.