మదనపల్లెలో ఘర్షణ.. 15 మందిపై కేసు నమోదు.

0
1

మదనపల్లె మండలంలోని కోళ్లబైలు గ్రామం జగనన్న కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణపై ఇరువర్గాలకు చెందిన సుమారు 15 మందిపై కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, తులసికి చెందిన పశువుల పాక వద్ద ఇరువర్గాల మధ్య గొడవ చెలరేగిందని, ఈ ఘటనలో పరస్పరం దాడులు చేసుకున్నారని పేర్కొన్నారు. తులసి వర్గానికి చెందిన ముగ్గురు, నూరుల్లా వర్గానికి చెందిన 11 మంది సహా మొత్తం 15 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు